మద్యం ప్రియులకు మళ్లీ షాక్.. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
మద్యం ప్రియులకు మళ్లీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ మరో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నట్టు తెలిపింది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదని, కొన్ని జిల్లాలలో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అసలు ఇంతకీ ఏ ఏ జిల్లాలలో మద్యం షాపులు మూసి వేయనున్నారు? అందుకు కారణం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే..
రేపు సాయంత్రం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం క్లోజ్
తెలంగాణ రాష్ట్రంలో మే 27వ తేదీన సోమవారం వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైంది. వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఆపై సైలెంట్ పీరియడ్ ప్రారంభం కాబోతుంది.

రేపు సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు వైన్స్ బంద్
ఈ క్రమంలో రేపు మే 25న సాయంత్రం నాలుగు గంటల నుండి మే 27 సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో మాత్రమే మద్యం దుకాణాలను, బార్ లను బంద్ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను లిక్కర్ తో ప్రభావితం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు .
ఎమ్మెల్సీ పల్లా ఎమ్మెల్యే కావటంతో అక్కడ ఉపఎన్నిక
ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.
ప్రధాన పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార హోరు
ఈ ఉపఎన్నికకు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు.
మూడు జిల్లాలలో లిక్కర్ షాపులు బంద్
ఇక రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో అన్ని పార్టీలలోనూ టెన్షన్ కనిపిస్తుంది. విద్యావంతులైన పట్టభద్రులు ఎవరిని ఆదరిస్తారో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ మూడు జిల్లాలలోనూ లిక్కర్ షాపులు బంద్ చేయనున్నారు. తిరిగి సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications