ఆడంభరాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ వేడుకలు , కేటీఆర్ ఆదేశం
మొదటి సారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నియమితులైన నేపథ్యంలో ఎంతో అట్టహసంగా నిర్వహించాలనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ వేడుకలు ఎన్నికల కోడ్ అమలు తో నిరాడంబరంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారి చేశారు.
ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ అవిర్బావ వేడుకలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈసారి వేడుకలు చాల సాధసీదాగా కొనసాగనున్నాయి. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ కి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియమితులు కావడంతో పెద్థ ఎత్తున పార్టీ అవిర్భావ వేడుకులు నిర్వహించే అవకాశం ఉండేది , దీంతో పార్టీకి మరింత కొత్త ఉత్సహం నింపే అవకాశం ఉండేది, కాని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకునే వేడుకలకు ఎన్నికల నిబంధనలు బ్రేక్ వేశాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించకూడదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులు పార్టీ అవిర్భావ వేడుకలను జెండా ఎగుర వేసి సాధారణంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో పార్టీ 18 వేడుకలు మాత్రం నామమాత్రంగా జరగనున్నాయి.