సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడి ఓటమిని తట్టుకోలేక ఆగిన అక్క గుండె...
ఎన్నికల్లో గెలుపు, ఓటములు అనేవి ప్రజానిర్ణయం. ఎందరో రాజకీయ ఉద్దండులు, మహామహులు సైతం ఘోర ఓటమిని చవిచూసిన సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో ఉన్నాయి. కాగా రీసెంట్ గానే తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. కానీ ఎన్నిక మాత్రం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందడం సర్వత్రా కలిచి వేస్తోంది.
ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్గా పోటీ చేయడంతో.. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) భావించింది. దీంతో ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి కూడా చేరుకుంది. అయితే కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మమత.

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. మమతకు గతంలో గుండెపోటు రావడంతో స్టంట్ వేసినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎన్నికల్లో 187 ఓట్ల తేడాతో ఓడిపోయిన శేఖర్ ఓడిపోయాడు. మొత్తానికి తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులతో పాటు సామాన్యులను సైతం తీవ్ర విషాదం కలిగిస్తోంది.
ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 4,236 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 2335, బీఆర్ఎస్ 1168, బీజేపీ 189, ఇతరులు 538 స్థానాల్లో ఆయా పార్టీల మద్దతు ఉన్న అభ్యర్ధులు విజయం సాధించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.93 శాతం పోలింగ్ నమోదు అయింది.
తక్కువ ఓట్ల తేడాతో విజయం..
నల్గొండ జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించాడు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే సర్పంచ్ అభ్యర్థి కూడా కేవలం 5 ఓట్లతో గెలుపొందింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో BRS బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో విజయం సాధించాడు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications