Hyderabad: జీఏఆర్ భవనంలో ప్రమాదం, ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో ఉన్న జీఏఆర్ భవనంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిన సహోద్యోగులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. జీఏఆర్ భవనంలో ఉన్న రెస్టారెంట్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని జీఏఆర్ భవన యాజమాన్యం పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ఇదే విషయం చెప్పారు. భవనంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదని.. గ్యాప్ ప్రెషర్ వల్ ప్రమాదం జరిగిందని నార్సింగి ఏసీపీ తెలిపారు.

తరుచుగా కమర్షియల్ భవనాల్లో ప్రమాదాలు సంభవించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, కొన్ని ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని కార్యాలయాలు, కమర్షియల్ భవనాల భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రమాద నివారణ చర్యలపై మరింత దృష్టిసారించనున్నారు.












Click it and Unblock the Notifications