వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఈ మేరకు కిషన్ రెడ్డి కాచిగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా బెదిరింంపు కాల్ వచ్చిందని కంప్లైంట్ లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

some one threatned by kishan reddy

గతంలోనూ ..
ఇప్పడే కాదు మార్చిలోనూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో దుండగుడు చంపేస్తానని బెదిరించాడు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తెలిపారు. తాజాగా మరోసారి ఫోన్ రావడం కలకలం రేపుతోంది.

రెండుసార్ల బెదిరింపులు ...
బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి .. ఎంపీగా గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే ముందు .. జరిగిన తర్వాత బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దీనిపై విచారణ జరిపి .. ఆకతాయా లేదా నిజమైన బెదిరింపులా అనే అంశాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.

English summary
The BJP leader, Kishan Reddy, was once again threat calls someone. At about 10 o'clock on Tuesday night, an unidentified person threatened to him. On this, Kishan Reddy complained to the Kachiguda police station. Kishan Reddy stated in the Compliant that he had previously been called some one. The case was registered and the case was investigated, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X