దారుణం: కన్న తల్లినే కర్రతో కొట్టి చంపేశాడు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిట్టీల వ్యాపారం చేసి నష్టాలు తీసుకొచ్చిందనే కోపంలో కన్నతల్లినే పాశవికంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
చిట్టీల వ్యాపారంలో అప్పులు పాలు కావడంతో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి నిలదీస్తున్నారని కొడుకు అవమానంగా భావించాడు. దీంతో తల్లి మమతను కొడుకు మదన్(22) బుధవారం రాత్రి భవనం పైకి తీసుకెళ్లి కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి భార్యపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications