T Hub పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ జీఓ రివర్స్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న టీ హబ్ (T Hub) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని, వైఖరిని మార్చుకుంది. హైదరాబాద్ లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా టీ హబ్ కు తరలించాలని గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలకు తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో వెనక్కి తగ్గింది. టీ హబ్ వినియోగంపై తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా టీ హబ్కు తరలించాలని జీఓ సైతం జారీ అయింది. ఈ జీఓ జారీ చేసిన జీఓను ఉపసంహరించుకుంది రేవంత్ ప్రభుత్వం. ఈ జీఓ గురించి తెలుసుకున్న వెంటనే అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు ఆదేశించారు.

ఈ మేరకు ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ని ఆదేశించారు. టీ హబ్ అనేది స్టార్టప్ల అభివృద్ధి కోసమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ హబ్ కు చెందిన ప్రతి అంగుళాన్ని కూడా స్టార్టప్లు, టెక్ సంస్థలు, అంకుర దశలో పరిశ్రమలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించినదని, ఇందులో ప్రభుత్వ కార్యలయాలు కొనసాడానికి ఎంతమాత్రం ఆస్కారం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
అటువంటి కంపెనీలకు ప్రోత్సాహం అందించడానికి మాత్రమే టీ హబ్ ను వినియోగించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ కు అనుగుణంగా, అనుకూలంగా యూనికార్న్లను సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అద్దె భవనాలలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్కు తరలించడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టార్టప్లకు ఇంక్యుబేటర్గా, ఆవిష్కరణల ఉత్ప్రేరకంగా స్థాపించి టీ హబ్లో మరే ఇతర కార్యాలయాలు ఉండకూడదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications