తెలంగాణలో గెలిచిన టీడీపీ: సంతోషంతో నారా లోకేష్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ అవకాశం వస్తుందని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 3 ఎంపీటీసీలను గెలుచుకుందని చెప్పారు.
ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని చెప్పారు. ఈ రెండు తెలుగుదేశం పార్టీతో సాధ్యమని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించిన రెండు ఎంపీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో టీడీపీ హవా కొనసాగింది.
TDP
is
back
with
a
bang
in
TS!
3
MPTCs
won
with
good
margins.
People
want
development
and
welfare.
It
can
only
happen
with
TDP.
—
Lokesh
Nara
(@naralokesh)
July
6,
2015
మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మీ 692 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ మూడు నెలల క్రితం టీడీపీ ఎంపీటీసీ పద్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది.
ఇక ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మట్కు 166 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో 75 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాజు విజయం సాధించారు.
ఇక్కడ కాంగ్రెస్ ఎంపీటీసీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో ఆ పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. తాజా ఫలితాలను చూస్తుంటే తెలంగాణలో టీడీపీ క్రమంగా పుంజుకునేలా కనిపిస్తోంది.