Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పింఛన్ల పెంపు, మహిళలకు సాయం.. డేట్ ఫిక్స్?

రాష్ట్రంలోని లబ్ధిదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వృద్ధాప్య పింఛన్ల పెంపు, మహాలక్ష్మి పథకం (నగదు సాయం) మరియు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమైంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో వీటికి నిధులు కేటాయించి, అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నిధుల అందుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు నివేదించింది.

2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పైన పేర్కొన్న మూడు కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.

Telangana Budget 2026 Major Funds for Rs 4000 Pensions and Mahalakshmi Scheme as Cabinet Finalizes Dates

ఆసరా పింఛన్ల పెంపు..!

తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు ఇతర కేటగిరీలకు ఇస్తున్న ఆసరా పింఛన్‌ను మేనిఫెస్టో హామీ ప్రకారం రూ. 4,000కు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం వీరికి ₹2,016 అందుతుండగా, దీనిని రెట్టింపు చేయడం వల్ల సుమారు 44 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికోసం ఏటా అదనంగా ₹11,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెంపును అమలు చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కొత్త పథకం.. ఇలా చేస్తే రూ. 25 వేలు నేరుగా మీ అకౌంట్ లోకి..!
రాష్ట్రంలో కొత్త పథకం.. ఇలా చేస్తే రూ. 25 వేలు నేరుగా మీ అకౌంట్ లోకి..!

మహాలక్ష్మి పథకం:

మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతి అర్హులైన మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకంపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబంలోని ఒక మహిళకు ఈ నగదు బదిలీ జరగనుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలవుతుండగా, ఈ నగదు సాయం కూడా తోడైతే మహిళలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

దశాబ్దాల పోరాటం ముగిసింది.. Maoist సామ్రాజ్యం క్లోజ్?
దశాబ్దాల పోరాటం ముగిసింది.. Maoist సామ్రాజ్యం క్లోజ్?

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్:

డిజిటల్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే కొత్త స్కీమ్‌ను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా ఉన్నత విద్య (Higher Education) అభ్యసించే పేద విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు గ్లోబల్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+