తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మిగతా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి విజయ అవకాశాలు ఉన్నవారికి కేటాయించి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు విజయం సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని టిపిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ క్రమంలో 17 స్థానాలకు గాను నాలుగు సీట్లు ప్రకటించగా, నేడు మిగతా 13 స్థానాలలో మెజారిటీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇస్తారు అన్న దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించడానికి సీఈసీ నేడు, రేపు భేటీ కానుంది. ఇప్పటికే 82 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు మూడవ జాబితాను ఫైనల్ చేయనుంది. దేశవ్యాప్తంగా పొత్తుల లో భాగంగా భాగస్వామ్య పక్షాలకు పోను, మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.
నేడు జరగనున్న సీఈసీ భేటీలో అగ్ర నేతలు పాల్గొని లిస్టు ఫైనల్ చేయనున్నారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ తదితరులు పాల్గొననున్నారు. భాగస్వామ్య పక్షాలకు పోనూ, మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.
ఈ భేటీలోనే తెలంగాణలో గతంలో ప్రకటించిన స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మూడవ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక నేటి సమావేశంలో అభ్యర్థుల ఖరారు చేయడంతో పాటు ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో పై కూడా ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications