ఖబడ్దార్: కేసీఆర్కు హెచ్చరిక, కాంగ్రెస్ నేతల అరెస్ట్
హైదరాబాద్: అవాకులు, చెవాకులు పేలితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుండెల్లో నిద్రపోతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం హెచ్చరించారు. హైదరాబాదుకు ఓ బ్రాండ్ ఉందని, తెరాస నిర్వాహకంతో హైదరాబాద్ కల్చర్ బ్రాండ్ దెబ్బతింటోందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పొన్నాల ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీ నేతలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాంగ్రెసు నేతలను అడ్డుకోవడంతో రహదారి పైన ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య. అవాకులు, చెవాకులు పేలితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు.
కాంగ్రెస్
రైతు కన్నీటికి కారణమైన ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
కాంగ్రెస్
ఇది ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు మరిన్ని ఆందోళనలు చేపడతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జాం దృశ్యం.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జాం దృశ్యం.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జాం దృశ్యం.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద కరెంట్ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా దృశ్యం.
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు
కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యల పైన కాంగ్రెసు పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ధర్నా అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న జైపాల్ రెడ్డి, పొన్నాల.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడారు. రైతు కన్నీటికి కారణమైన ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు మరిన్ని ఆందోళనలు చేపడతామన్నారు. అవాకులు, చెవాకులు పేలితే ఖబడ్దార్ అని, గుండెల్లో నిద్రపోతామని కేసీఆర్ను హెచ్చరించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు కారణం సోనియా గాంధీయే అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో తెరాస అధికారంలోకి వచ్చిందన్నారు.
వరుసగా విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు తిరగబడేందుకు సమయం ఆసమన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన పొన్నాల సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.