తెలంగాణలో బిగుస్తున్న ఉచ్చు
ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కు ఈ లేఖను పంపించారు. ఈ కేసులో అర్వింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇదివరకే అనుమతి సైతం ఇచ్చారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు గతంలోనే గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి సుమారు 55 కోట్ల రూపాయల అనధికారిక చెల్లింపులకు సంబంధించినది. హైదరాబాద్ లో 2023లో ఫార్ములా ఈని నిర్వహించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఎడిషన్ రద్దయ్యింది.

ఈ నేపథ్యంలో అర్వింద్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024 జనవరిలో అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్కు మెమో జారీ కూడా అయింది. ఫార్ములా ఈకి అనుమతి లేని నిధుల మంజూరు, వాటికి అధికారికంగా ఎటువంటి ఆమోదాలు లేకపోవడం, కంపెనీకి నిధులు చెల్లించడంపై వివరణ కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ఏడాది జనవరి 6న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మెమో జారీ చేశారు.
సచివాలయంలోని శాఖల ఆమోదం, అర్హత గల అధికారి అనుమతి లేకుండా నిర్ణయాలు, చెల్లింపులెందుకు జరిగాయని ప్రశ్నించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో సీజన్-10 ఫార్ములా ఈకి సవరించిన ఒప్పందం కుదుర్చడంపై కూడా లేఖలో స్పష్టత కోరారు. అప్పట్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుండి ఫార్ములా ఈకి రూ. 46 కోట్లు, పన్ను మరో తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించారు.
దీనికి కుదిరిన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందే హెచ్ఎండీఏ బోర్డు.. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే' ఈ మొత్తం చెల్లించినట్లు మెమోలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం, కేంద్ర/రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి చేసే ఒప్పందాలు రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా జరగాలి. మెమోపై అర్వింద్ కుమార్ స్పందించారు. అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలను పాటించానని వివరించారు.
దీని తర్వాత కేటీఆర్, అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా అర్వింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ డీఓపీటీకి లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. డీఓపీటీ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications