పదో తరగతి ఇంటర్నల్ మార్కుల రద్దుపై సర్కారు వెనక్కి
పదో తరగతి పరీక్ష విధానంపై తెలంగాణ ప్రభుత్వం గురువారం తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకుంది. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్య సంవత్సరానికి నిలిపివేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.

2024-25 విద్య సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. ఆ గ్రేడింగ్ సిస్టంను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అయితే, ఇలాంటి నిర్ణయాలను విద్య సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు, పలు విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. మూడు నెలల 10 రోజులకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇప్పటికే సమ్మెటివ్ అసెసె్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు పూర్తయ్యాయి. ీ క్రమంలో విద్యారంగ నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2025-26 నుంచి నూతన మార్కుల విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications