TSEAMCET 2023: స్టూండెట్స్..బీ అలర్ట్: కీలక తేదీలు ఇవే
తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే అధికారులు దీన్ని విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే సాంకేతిక విద్య మంత్రిత్వ శాఖ అధికారులు దీన్ని విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి దీన్ని విడుదల చేశారు.

సీబీటీ ఎగ్జామ్స్..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. యూనివర్శిటీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అఫ్లియేటెడ్ ప్రొఫెషనర్ కాలేజీల్లో తొలి ఏడాది ప్రవేశాన్నిపొందడానికి టీఎస్ ఎంసెట్ 2023 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంజినీరింగ్..
బీఈ, బీటెక్, బయో టెక్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీల్లో బీఎస్సీ (హాన్స్), బీఎస్సీ నర్సింగ్, డీ ఫార్మసీ, వెటరినరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్ పరీక్షల్లో ర్యాంకును సాధించాల్సి ఉంటుంది.

తేదీలు ఇవే..
ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28వ తేదీన వెలువడుతుంది. మార్చి 3వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆలస్యపు రుసుము లేకుండా- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 4. ఆన్ లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు ఉంటే ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు సవరించుకోవచ్చు.

ఆలస్యపు రుసుముతో..
ఆలస్యపు రుసుముతో దరఖాస్తులను దాఖలు చేయడానికి వేర్వేరు రకాల చివరి తేదీలను నిర్ణయించారు అధికారులు. 250 రూపాయల ఆలస్యపు రుసుముతో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను దాఖలు చేయవచ్చు. 500 రూపాయలతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, 2,500 రూపాయలతో ఏప్రిల్ 25వ తేదీ వరకు, 5,000 రూపాయల ఆలస్యపు రుసుముతో మే 2వ తేదీ వరకు విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించవచ్చు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..
ఏప్రిల్ 30వ తేదీన అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 7, 8, 9,10, 11 తేదీల్లో ఎంసెట్ పరీక్షలను అధికారులు షెడ్యూల్ చేశారు. ఇంజినీరింగ్ పరీక్షలు 7,8,9 తేదీల్లో షెడ్యూల్ అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ అయ్యాయి.
-
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications