Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్థలం ఉన్నా, లేకున్నా మీకు సొంతిల్లు గ్యారెంటీ!

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు, అందులో సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం తపన పడుతున్న వారికి శుభవార్త చెప్పారు. త్వరలోనే పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నాలుగున్నర లక్షలు ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.

పేదవారికి శుభవార్త

రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదలు లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని ,స్థలం లేని వారికి జీ ప్లస్ టు తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్ట పడుతుందన్నారు.

telangana govt good news own house gauarentee to the poor who don t have houses in telangana

అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వ అనేక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు.

ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు

2025- 26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇళ్లలో 53శాతం వరకు ఇప్పటివరకు పురోగతి సాధించాయి. ఇంకా 47శాతం ఇళ్ళ పనులు పూర్తి కావలసి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళను కేటాయిస్తున్నారు. అయితే 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,69,014ఇళ్ళను కేటాయించగా ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.

ఇందిరమ్మ ఇళ్ళ నిధుల విడుదల ఇలా

మిగిలిన ఇళ్లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 4000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిధులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్నారు. నిధులు విడుదల అవుతున్నప్పటికీ చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇళ్ళ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఇదే

ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక కొరత ఉండడం, ఇటుక, ఐరన్, సిమెంట్ ధరలు బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు, ఇక స్థలం లేని వారికి జి ప్లస్ 2 చొప్పున ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+