తెలంగాణ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఆ పరీక్షలు వాయిదా: మళ్లీ ఎప్పుడంటే?
Group 2 Exams in Telangana: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విజ్ఞప్తిని..తెలంగాణ ప్రభుత్వం ఆలకించింది. దీని పట్ల సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 2 పరీక్షలను అయిదు నెలల పాటు వాయిదా వేసింది. డిసెంబర్లో నిర్వహిస్తామని తెలిపింది.
టీఎస్పీఎస్సీ ఇదివరకు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సి ఉంది. మొత్తం 783 పోస్టుల కోసం గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాల్సి ఉంది ఆ రెండు తేదీల్లో. ఈ పరీక్షల కోసం దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయడానికి ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసే ప్ర్రక్రియను కొనసాగించింది.
ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. అదే సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం అభ్యర్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ రెండు పరీక్షలను ఒకేసారి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండింటి కోసం ప్రిపేర్ కావాల్సిన పరిణామాలను అభ్యర్థులను ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో- గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ కొద్దిరోజులుగా విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications