రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ప్రకటించింది. ఇదే సమయంలో మరో తాజా నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. రైతు భరోసా అమలు లో అర్హుల విషయం పైన మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పథకం అమలు చేయనుంది. ఈ మేరకు కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ విరామం తరువాత యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. మార్చి 22వ తేదీ నుంచి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. మూడు విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో రూ.3,590 కోట్లు అందించనుంది. 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతలో 73 లక్షల మంది రైతులకు అందనుండగా.. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా మరికొంతమంది రైతులకు అందించనున్నారు. ఇక మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయనున్నారు. మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతులకు అందించనున్నారు. కాగా, పథకం అమలు.. అర్హతల విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజమైన సాగు రైతులకే ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత సీజన్ లో అమలు చేసిన వారందరికీ తిరిగి ఈ సారి నిధులు జమ కానున్నాయి.

22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులకు రైతు భరోసా పథకం వర్తించదు. ఇక వ్యవసాయానికి అనుకూలంగా లేని కమర్షియల్ భూములకు వర్తించదని అధికారులు స్పష్టత ఇస్తున్నారు. ఇక ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాకపోతే అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్నవారికి ఈ పథకం వర్తించదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రజాప్రతినిధులకు కూడా రైతు భరోసా పథకం వర్తించదని అధికారులు వెల్లడించారు. ఇక ఆలయాలు, ట్రస్టులు, ఇతర సంస్థల పేరుపై ఉన్న వ్యవసాయ భూములు కలిగి ఉన్నవారు కూడా అనర్హులుగా పేర్కొన్నారు. అయితే.. దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి -వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూమి అయి ఉండాలని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సాయం అందిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం













Click it and Unblock the Notifications