ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై భగ్గుమన్న లాయర్లు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని హుస్సేన్సాగర్ ప్రక్షాళన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాసిన వార్తాకథనానికి తెలంగాణ న్యాయవాదులు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై భగ్గుమన్నారు. తీర్పునకు వక్రభాష్యం పలుకుతూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలంగాణ న్యాయవా ద జేఏసీ నేతలు విమర్శించారు.
వార్తాకథనాలకు నిరసనగా గురువారం జూబ్లీహిల్స్లోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. న్యాయవాద జేఎసీ కో-కన్వీనర్ కే గోవర్దన్రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్ ఉపేంద్రలు మాట్లాడారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు నష్టపోయిన తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్ ఓ ఆశాదీపంలా మారారని వారన్నారు. నాడు కేసీఆర్ నడిపిన ఉద్యమంపై విషయం కక్కిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ, నేడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసత్య కథనాలను ప్రచురిస్తూ సభ్య సమాజానికి, పత్రిక రంగానికే మాయమచ్చగా మారాడని ఆరోపించారు.
హుస్సేన్ సాగర్ నీటి విడుదలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించి వార్తా కథనాలు ప్రచురించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలపై 200 సీఆర్పీ కింద కేసు వేసి న్యాయస్థానంలో నిలబెడుతామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు బిక్షమయ్య, కే సదానందం, ప్రవీణ్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications