హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కత్తితో బ్యాంకులోకి చొరబడిన టెక్కీ: భార్య ఎదుట చచ్చిపోతానంటూ డ్రామా

కోటక్ మహీంద్ర బ్యాంకులోకి ఓ టెక్కీ కత్తితో చొరబడి భార్య కళ్ల ముందు చచ్చిపోతానంటూ హంగామా చేశాడు. భార్య ఆ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఓ టెక్కీ బ్యాంకులోకి కత్తితో గుసాయించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతని భార్య ఆ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది.

భార్య కళ్ల ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానని అతను బెదిరించాడు. ఎంటెక్ గ్రాడ్యుయేట్ అయిన జె. అశ్విన్ అనే 30 ఏళ్ల యువకుడు టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నాడు. భార్యతో అతనికి విభేదాలున్నాయి. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో బ్యాంకులోకి ప్రవేశించాడు.

Telangana: Man barges into bank with knife

తన భార్య శుభత బ్యాంకులో ఉందనే ఉద్దేశంతో అతను కత్తితో బ్యాంకులోకి చొరబడ్డాడు. కానీ ఆమె ఆఫీసుకు రాలేదు. బ్యాంకు సెక్యురిటీ సిబ్బంది అతన్ని ఆపేసి పోలీసులను పిలిచారు. సికింద్రాబాదులోని గోపాలపురం పోలీసులు అతన్ని పట్టుకుని తీసుకెళ్లిపోయారు.

Telangana: Man barges into bank with knife

అశ్విన్‌లో సూసైడ్ టెండన్సీ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అతని భార్యను పిలిపించారు. అశ్విన్, శుభతకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అతన్ని వదిలేయాలని శుభత పోలీసులను కోరింది. అయితే, పోలీసులు అశ్విన్‌పై కేసు నమోదు చేశారు.

English summary
High drama unfolded at the Kotak Mahindra Bank branch in Secunderabad on Monday when a techie barged into the bank, pulled out a knife and threatened to kill himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X