చెస్ట్ఆసుపత్రి రగడ: కేసీఆర్ సీట్ల ప్లాన్, డాక్టర్ల మద్దతు
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రి వికారాబాద్కు తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సీట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనే ప్రత్యేకంగా ఛాతి వైద్యుల విభాగాన్ని నెలకొల్పాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.
ఇంతకాలం ఈ రెండు వైద్య కళాశాలలకు అనుబంధంగా క్షయ, ఛాతి వ్యాధుల చికిత్స కోసం ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం అనంతగిరిలోని క్షయ సానిటోరియానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఎయిమ్స్ నుండి ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు గాంధీ, ఉస్మానియాలలో ప్రత్యేకంగా ఛాతి వ్యాధుల విభాగాన్ని నెలకొల్పాలని చూస్తోంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోకుండా ఉండాలంటే... వైద్య కళాశాలలకు పది కిలోమీటర్ల దూరంలోనే సంబంధిత విభాగం ఉండాని ఎంసీఐ నిబంధనలు చెబుతున్నాయి.
కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు సచివాలయంలో హెల్త్ అండ్ మెడికల్ పైన సమీక్ష నిర్వహించారు.
డాక్టర్ల మద్దతు
ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిని వికారాబాద్ మండలంలోని అనంతగిరికి తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. దీని పైన పలువురు మండిపడుతున్నారు. వైద్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు.
డాక్టర్ల మద్దతు
ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిని వికారాబాద్ మండలంలోని అనంతగిరికి తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. దీని పైన పలువురు మండిపడుతున్నారు. వైద్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న డాక్టర్లు.
డాక్టర్ల మద్దతు
ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిని వికారాబాద్ మండలంలోని అనంతగిరికి తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. దీని పైన పలువురు మండిపడుతున్నారు. వైద్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు.