తెలంగాణ కొత్త సీఈవోగా శశాంక్ గోయల్, ఆదేశాలు జారీచేసిన సీఈసీ..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రజత్ కుమార్ స్థానంలో ఈసీగా శశాంక్ గోయల్ విధులు నిర్వర్తిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ముగ్గురి పేర్లను సీఈసీకి సిఫారసు చేసింది. అందులో కేంద్ర ఎన్నికల సంఘం శశాంక్ గోయల్ వైపు మొగ్గుచూపింది.
Recommended Video
సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్కు సమర్థమైన అధికారిగా మంచి పేరుంది. 1990 బ్యాచ్కు చెందిన గోయల్ ప్రస్తుతం తెలంగాణ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడినుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పనిచేయబోతున్నారు. ఈసీ రజత్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల సంఘం సీఈవోగా కోసం ముగ్గురి పేర్లను తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయగా.. శశాంగ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.