రూ.10 లక్షలు ఖర్చు చేసినా గెల్వలేదు.. ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేశాడో తెలుసా..?
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇటీవల మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తొలి విడతలో 4,230 గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అధికార కాంగ్రెస్ మద్దతు దారులు 2,425 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో గెలుపొందారు. అలాగే బీజేపీ అభ్యర్థులు 189 స్థానాల్లో ఎన్నికయ్యారు. ఇక స్వతంత్రులు 401 స్థానాల్లో విజయం సాధించారు. అయితే తెలంగాణలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయినా.. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాని గ్రామానికి చెందిన కల్లూరి బాలరాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కల్లూరి బాలరాజు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి జక్కల పరమేశ్ సర్పంచ్ గా విజయం సాధించారు. జక్కల పరమేశ్ చేతిలో 450 ఓట్ల తేడాతో బాలరాజు ఓటమి పాలయ్యారు. అయితే ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న కోరికతో ఈ ఎన్నికల్లో బాలరాజు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. అయితే ఓడిపోవడంతో తాను ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్ల వసూలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానని భావించి బాలరాజు ఓటమిపాలు కావడంతో తీవ్ర మనోవేధనకు లోనయ్యాడు. దాంతో బాలరాజు చేతిలో దేవుడి ఫోటో పెట్టుకుని నగదు వసూలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తాను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుడి ఫోటోతో గడప గడప తొక్కి అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బాలరాజు భార్య ఏకంగా పురుగుల మందు డబ్బే చేతిలో పట్టుకుని మరీ బెదిరిస్తూ తమ నగదును వసూలు చేసుకుంటున్నారు. అయితే తాము మీకే ఓట్లు వేశామంటూ దేవుడిపై ప్రమాణం చేస్తున్నారు గ్రామస్థులు. అందరూ ఓట్లు వేస్తే మరి తాను ఎలా ఓడిపోయానంటూ బాలరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications