ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టి
సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తీసుకొచ్చారని గుర్తుచేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాచ్చారని మండిపడ్డారు. దీంతో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ మార్చారని ధ్వజమెత్తారు.
108 టు 104: కరోనా పేషంట్ను కనికరించని సిబ్బంది, అంబులెన్స్ రాక మృతి, వీడియో ట్వీట్ చేసిన లోకేశ్
తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో అప్పు 68 వేల కోట్లు ఉండేదని.. అది క్రమంగా పెరిగినట్టు పెరిగిపోతుందని చెప్పారు. 2019-20లో రూ. 2 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. వచ్చే ఏడాది అది 3.20 లక్షల కోట్లకు చేరుతుందనన్నారు. 2023 నాటికి రాష్ట్రం అప్పు 6 లక్షల కోట్లకు చేరుతుందని భట్టి వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై లక్ష 50వేల అప్పు ఉంటుందన్నారు.
Recommended Video
రాష్ట్రంలో వ్యక్తి తలసరి ఆదాయం రూ. 2 లక్షలు అని భట్టి గుర్తుచేశారు. జాతీయ ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. కానీ తీసుకొస్తున్న అప్పుల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. నిధులన్నీ ఏమవుతున్నాయని అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రానికి, ఆర్థిక సంస్థలకు అప్పులు ఇవ్వొద్దని చెప్తామన్నారు.