జమ్మూ కాశ్మీర్ వరదల్లో తెలంగాణ టెక్కీ
కరీంనగర్: విహార యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకతను తన మిత్రులతో పాటు జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్నాడు. అయితే, వారంతా సురక్షితంగా ఉన్నారు. వారిని అధికారులు సురక్షితంగా శ్రీనగర్లోని రాజభవన్కు తరలించారు.
కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి వనజ, రామారావు దంపతుల కుమారుడు వంశీకృష్ణ మూడేళ్లుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన తన ముగ్గురు మిత్రులు బాలకృష్ణ, గోపి, మరొకతనితో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

యాత్రలో భాగంగా వంశీకృష్ణ మిత్రబృందం జమ్మూ కాశ్మీర్లో తిరుగుతుండగా భారీ వర్షాలతో వరదలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్నవారితో పాటు వంశీకృష్ణ, అతని మిత్రులు వరదల్లో చిక్కున్నారు. వారిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తమను రెండు మూడు రోజుల్లో హైదరాబాదు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశీకృష్ణ ఫోన్లో కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని తల్లి ప్రార్థిస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications