జమ్మూ కాశ్మీర్ వరదల్లో తెలంగాణ టెక్కీ
కరీంనగర్: విహార యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకతను తన మిత్రులతో పాటు జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్నాడు. అయితే, వారంతా సురక్షితంగా ఉన్నారు. వారిని అధికారులు సురక్షితంగా శ్రీనగర్లోని రాజభవన్కు తరలించారు.
కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి వనజ, రామారావు దంపతుల కుమారుడు వంశీకృష్ణ మూడేళ్లుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన తన ముగ్గురు మిత్రులు బాలకృష్ణ, గోపి, మరొకతనితో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

యాత్రలో భాగంగా వంశీకృష్ణ మిత్రబృందం జమ్మూ కాశ్మీర్లో తిరుగుతుండగా భారీ వర్షాలతో వరదలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్నవారితో పాటు వంశీకృష్ణ, అతని మిత్రులు వరదల్లో చిక్కున్నారు. వారిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తమను రెండు మూడు రోజుల్లో హైదరాబాదు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశీకృష్ణ ఫోన్లో కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని తల్లి ప్రార్థిస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications