ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు - దక్కేదెవరికి..!!
తెలంగాణలో కొత్త ఆర్వోర్ చట్టం అందుబాటులోకి రానుంది. ఈ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ లో కీలక మార్పులు జరగనున్నాయి. అదే విధంగా సాదాబైనామా దరఖాస్తులకూ పరిష్కారం లభించనుంది. హక్కు పత్రాలను జారీ చేసే అధికారాలను ఆర్డీవోలకు కట్టబెడతారు. భూములకు విశిష్ట సంఖ్య- భూధార్ కేటాయింపు జరిగితే.. దేశంలోనే ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది.
కొత్త ఆర్వోర్ చట్టం అమలు ద్వారా భూ రికార్డుల నిర్వహణలో గ్రామ స్థాయిలో పూర్తి పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. అంటే.. వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. పాత సమస్యలకు పరిష్కారం లభించనుంది.

అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త ఆర్వోఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్, సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే.. వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు. ఈ అధికారం ఆర్డీవోకు ఉంటుంది. 1989 నుంచి 2016 వరకు సాదాబైనామా దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీవోలకు దక్కనున్నాయి.
భూమి మీద 18 రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్వోఆర్ అవకాశం కల్పిస్తోంది. సెక్షన్2(12), 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూమిని మూడు కేటగిరీలుగా విభజించి, హక్కులు కల్పిస్తారు. సెక్షన్-5 ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లో అభ్యంతరాలుంటే.. మ్యుటేషన్ను నిలిపివేసే అవకాశాన్ని అధికారులకు కల్పించారు. అయితే.. మ్యుటేషన్ను నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖతపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. కొత్త ఆర్వోఆర్ ప్రకారం ప్రభుత్వం మూడు దశల్లో ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించనుంది. భూ సమస్యలను కూడా మూడంచెల్లో పరిష్కరించనుంది. ధరణిలో గుర్తించిన 45 రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications