Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల కోసం కేంద్రం కీలక హెచ్చరిక.. వారికి 50లక్షల ఫైన్, 5ఏళ్ళ జైలుశిక్ష!

రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. అందులో భాగంగా కేంద్రం తాజాగా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదా విడుదల చేసింది. దీంతో నకిలీ పురుగుమందులకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. నకిలీ పురుగు మందుల వాడకం, విక్రయాలపైన తీవ్ర హెచ్చరిక జారీ చేసిన కేంద్రం నకిలీ ఉత్పత్తులు అమ్మినా, వాడినా నేరంగా చెప్తోంది.

అలా చేస్తే 50లక్షల జరిమానా
రైతులు నకిలీ ఉత్పత్తులను వినియోగించినా, షాపు యజమానులు అమ్మినా రూ. 50 లక్షల వరకు జరిమానా, లేదా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పెరుగుతున్న పురుగు మందుల వాడకంతో పంటలు, పర్యావరణం దెబ్బతిని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.

The central govt issued a crucial warning for farmers on pesticides they face a fine of 50 lakhs

ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరిన కేంద్రం
'పురుగు మందుల నిర్వహణ బిల్లు, 2025' ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం ఈ ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను ఫిబ్రవరి 4వ తేదీ లోపు కోరుతోంది. గత ఏడాది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో మాట్లాడినప్పుడు రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల కారణంగా తమకు కలుగుతున్న ఇబ్బందిపై మంత్రికి తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అవకాశం
నాసిరకం ఉత్పత్తులపై ప్రభుత్వానికి రైతుల నుండి ఫిర్యాదులు రావటంతో కేంద్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వ్యవసాయ శాఖాధికారులకు చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అధికారాన్ని కల్పిస్తుంది. దీంతో దుకాణం దారులలో ఆందోళన కనిపిస్తుంది.

కేంద్రం కఠిన చర్యలతో రైతులు ఇబ్బంది పడే అవకాశం
అయితే ఈ బిల్లుతో నకిలీ నివారణకు కేంద్రం కఠిన చట్టాలను తెచ్చినా, నకిలీ, అసలు పురుగుమందులు, విత్తనాలను రైతులు ఎలా గుర్తిస్తారు అనే చర్చ జరుగుతుంది. అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు అంటే అది రైతులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పురుగుమందుల షాపుల నిర్వాహకులకు బిగ్ షాక్
పురుగుమందుల షాపుల నిర్వహకులపైనే చర్యలు తీసుకునేలా చూస్తే రైతు దాకా నకిలీ ఉత్పత్తులు చేరవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పురుగుమందుల షాపుల నిర్వాహకులకు పెద్ద హెచ్చరిక అనే చెప్పాలి. రైతులకు లబ్ది చేకూరుస్తుంది అనే చెప్పాలి. భూసారాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడి, రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+