రైతుల కోసం కేంద్రం కీలక హెచ్చరిక.. వారికి 50లక్షల ఫైన్, 5ఏళ్ళ జైలుశిక్ష!
రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. అందులో భాగంగా కేంద్రం తాజాగా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదా విడుదల చేసింది. దీంతో నకిలీ పురుగుమందులకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. నకిలీ పురుగు మందుల వాడకం, విక్రయాలపైన తీవ్ర హెచ్చరిక జారీ చేసిన కేంద్రం నకిలీ ఉత్పత్తులు అమ్మినా, వాడినా నేరంగా చెప్తోంది.
అలా చేస్తే 50లక్షల జరిమానా
రైతులు నకిలీ ఉత్పత్తులను వినియోగించినా, షాపు యజమానులు అమ్మినా రూ. 50 లక్షల వరకు జరిమానా, లేదా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పెరుగుతున్న పురుగు మందుల వాడకంతో పంటలు, పర్యావరణం దెబ్బతిని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.

ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరిన కేంద్రం
'పురుగు మందుల నిర్వహణ బిల్లు, 2025' ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం ఈ ముసాయుదాపై ప్రజల నుండి అభిప్రాయాలను ఫిబ్రవరి 4వ తేదీ లోపు కోరుతోంది. గత ఏడాది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో మాట్లాడినప్పుడు రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల కారణంగా తమకు కలుగుతున్న ఇబ్బందిపై మంత్రికి తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అవకాశం
నాసిరకం ఉత్పత్తులపై ప్రభుత్వానికి రైతుల నుండి ఫిర్యాదులు రావటంతో కేంద్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వ్యవసాయ శాఖాధికారులకు చిన్న లోపాలు ఉన్నా సరే భారీ జరిమానాలు విధించే అధికారాన్ని కల్పిస్తుంది. దీంతో దుకాణం దారులలో ఆందోళన కనిపిస్తుంది.
కేంద్రం కఠిన చర్యలతో రైతులు ఇబ్బంది పడే అవకాశం
అయితే ఈ బిల్లుతో నకిలీ నివారణకు కేంద్రం కఠిన చట్టాలను తెచ్చినా, నకిలీ, అసలు పురుగుమందులు, విత్తనాలను రైతులు ఎలా గుర్తిస్తారు అనే చర్చ జరుగుతుంది. అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు అంటే అది రైతులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పురుగుమందుల షాపుల నిర్వాహకులకు బిగ్ షాక్
పురుగుమందుల షాపుల నిర్వహకులపైనే చర్యలు తీసుకునేలా చూస్తే రైతు దాకా నకిలీ ఉత్పత్తులు చేరవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పురుగుమందుల షాపుల నిర్వాహకులకు పెద్ద హెచ్చరిక అనే చెప్పాలి. రైతులకు లబ్ది చేకూరుస్తుంది అనే చెప్పాలి. భూసారాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడి, రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.
-
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications