Jagityala: చనిపోయిన కూతురు ఫొటోకు కేక్ తినిపించిన తల్లిదండ్రులు.. హృదయాన్ని కదిలించిన దృశ్యం..
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలే జీవితంగా బతుకుతారు. వారి కోసం అహర్నిశలు కృషి చేస్తారు. పిల్లల గెలుపులోనే తమ ఆనందాన్ని వెతుకుంటారు. కానీ విధి ఓ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. కూతురే సర్వస్వంగా బతుకున్న తల్లికి మనశ్శాంతి లేకుండా చేసింది. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన ఆ జ్వరం మింగేసింది.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ కు చెందిన రాజు, రసజ్ఞ దంపతులకు నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి ఉంది. దాదాపు నెల రోజుల కిందట జ్ఞానన్వి జర్వం వచ్చింది. దీంతో ఆమె మందలు వేశారు. కానీ పరిస్థితి విషమించి చిన్నారి చనిపోయింది. అయితే గురువారం జ్ఞానన్వి పుట్టిన రోజు, దీంతో రాజు, రసజ్ఞ కూతురు సమాధి వద్దకు వచ్చి బర్త్ డే చేశారు.
జ్ఞానన్వి ఫొటోకు దంపతులిద్దరూ కేక్ తినిపిస్తూ కన్నీమున్నీరయ్యారు. కూతురు ఫోటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కదిలించింది. ఈ దృశ్యం చూసిన వారందరూ కన్నీరు పెట్టుకున్నారు.