రేపో ఎల్లుండో తెలంగాణ ఇంటర్ ఫలితాలు..! ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్ బోర్డ్..!!
హైదరాబాద్: పొరుగున ఉన్న ఏపీలో ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకా తెలంగాణలో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. అయితే ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా 12వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏపీ మాత్రమే విడుదల చేసింది. ఇంటర్ ఫలితాల వెల్లడి తేదీలపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది.
ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుదిదశలో ఉందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన 4,90,169 మంది విద్యార్థీని విద్యార్థులు ఉన్నారు.