'నగరంలో ఆంధ్ర ఆఫీసులకు విద్యుత్ నిలిపివేస్తాం'
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సమస్యలకు కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పనితీరు మార్చుకోకపోతే హైదరాబాద్ లో ఉన్న వారి ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ నిలిపివేస్తామని టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు.
మంగళవారం ట్యాంకుబండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వీరు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంటే... అందుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని పేర్కొన్నారు.
విద్యుత్ ఒప్పందాల రద్దుతో మొదలైన తెలంగాణ వ్యతిరేక విధానాలను తాజగా శ్రీశైలం ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యునల్కు చంద్రబాబుకు లేఖ రాయడం ద్వారా తెలంగాణపై ఉన్న వ్యతిరేకతను మరోసారి చూపించారని అన్నారు.

తెలంగాణలో విద్యుత్ కష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆటంకాలు సృష్టిస్తున్నారని.. దీనికి కేంద్రం కూడా సహాయం చేస్తుందని ఆరోపించారు.
ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నైజాన్ని గుర్తించి విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఇంటి ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఓదేలు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు భాముప్రసాద్, సలీమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications