వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీట్లు తగ్గాయి సరే .. ఓటు షేర్ పెరిగింది కదా .. కేటీఆర్ భాష్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన సీట్లు రాకపోయిన .. ఓటు శాతం పెరిగిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో కంటే 6 శాతం తమ పార్టీకి పెరిగిందని గుర్తుచేశారు. తాము 16 సీట్లు వస్తాయని ఆశించింది .. నిజమేనని కానీ ట్రెండింగ్ కాస్త డిఫరెంట్‌గా అనిపించిందని వివరించారు.

అంచనా వేయలేకపోయాం ..
లోక్‌సభ ఎన్నికల్లో ట్రెండింగ్ విచిత్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై అంచనాలు తప్పయన్నారు. గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పొందామని గుర్తుచేశారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు .. గెలుపు కాదన్నారు. భారీ మెజార్టీ సాధించలేదని .. అది నామమాత్ర విజయం కిందకొస్తుందన్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో 10 వేల ఓట్ల తేడాతో విజయం .. విజయం కాదన్నారు.

trs vote share increase : ktr

మోదీ వేవ్ ..
దేశంలో ప్రధాని మోదీ అనుకూల పవనాలు వీచాయని గుర్తుచేశారు. అందుకే కొన్నిచోట్ల బలహీనమైన బీజేపీ అభ్యర్థులు ఉన్నా .. విజయం సాధ్యమైందని వివరించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 16 సీట్లు గెలువాలనే కృతనిశ్చయంతో పనిచేశామని పేర్కొన్నారు. కానీ ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారాయన. ఇది తమకు తాత్కాలికంగా స్పీడ్ బ్రేకరేనని స్పష్టంచేశారు. తాము మళ్లీ పుంజుకుంటామన్నారు.

English summary
In the Lok Sabha polls, the TRS party has not come to the polls, but the vote percentage has increased, TRS working president Ktr said. Recall that the party has increased by more than 6 per cent in the past. They wanted 16 seats, but it was true that Trending was different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X