మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది - కానీ, వార్నింగ్ బెల్ మోగింది..!!
మునుగోడులో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, మెజార్టీ లెక్కలు తప్పాయి. 10 వేలకు పైగా ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి టీఆర్ఎస్ - బీజేపీ మధ్య గట్టి పోటీనే నడించింది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ అభ్యర్ధి ఆధిక్యతలో నిలిచారు. ఆ తరువాత అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి మెజార్టీ సాధించినా.. ఏ రౌండ్ లోనూ వెయ్యి ఓట్లు దాటలేదు. రాజగోపాల్ ఓటిమికి కాంగ్రెస్ చీల్చిన ఓట్లు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ సక్సెస్
మొత్తం 15 రౌండ్లలో 14 రౌండ్లకు సంబంధించి అధికారికంగా లెక్కలను ప్రకటించారు. అందులో టీఆర్ఎస్ కు 95,208 ఓట్లు రాగా, బీజేపీకి 85,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 23,604 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. పోలింగ్ పూర్తయిన తరువాత నుంచి ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యత ఉన్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. బీజేపీ తమకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని విశ్వసించింది. చౌటుప్పల్ ఓటింగ్ పైన భారీగా రాజగోపాల్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, అక్కడ కొంత మేర మాత్రమే ఆశించిన విధంగా ఆధిక్యత తెచ్చుకోగలిగారు. కానీ, అక్కడా కాంగ్రెస్ ఎఫెక్ట్ పడింది. ఫలితంగా రెండు, మూడు రౌండ్లలో రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత సాధించినా.. ఓవరాల్ గా మాత్రం టీఆర్ఎస్ పైన మెజార్టీ సాధించలేకపోయారు. తొలి నుంచి కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమికి పని చేసినట్లు అర్దం అవుతోంది.

మునుగోడులో కేసీఆర్ విభిన్న వ్యూహం
రాజగోపాల్ కొంత మంది కాంగ్రెస్ నేతలను తనతో పాటుగా తీసుకెళ్లగలిగినా.. ఓటర్ల మనసు మాత్ర మార్చలేకపోయారు. కానీ ఇదే సమయంలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వటంలో రాజగోపాల్ సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ తొలి నుంచి మునుగోడులో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేతలందరినీ మునుగోడులో మొహరించి.. తన వ్యూహాలు అమలు చేసారు. హుజూరాబాద్ కు భిన్నంగా వ్యవహరించారు. పోల్ మేనేజ్ మెంట్ లో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. అయితే, మెజార్టీ పైన మాత్రం టీఆర్ఎస్ నాయకత్వం సంతోషంగా లేదని తెలుస్తోంది. దాదాపు 25 వేల పైగా మెజార్టీతో బీజేపీకి సమాధానం చెప్పాలని భావంచి..దానికి తగిన విధంగా లెక్కలు..వ్యూహాలు సిద్దం చేసినా, మెజార్టీ తగ్గింది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత జరిగిన తొలి ఎన్నికలో బీజేపీ నుంచి ఈ స్థాయిలో పోటీ ఎదుర్కోవటం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా విశ్లేషకులు సూచిస్తున్నారు.

రాజగోపాల్ ఆశలు ఆవిరి
చౌటుప్పల్ తో పాటుగా చండూరు అదే విధంగా నాంపల్లి పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ, గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ కు మెజార్టీ ఓట్లు పోలవ్వటంతో బీజేపీ ఆశలు ఏవీ ఆచరణ రూపంలో అమలు కాలేదు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎవరు గెలిచినా అయిదు వేల ఓట్ల తేడాతో గెలుస్తారని అంచనా వ్యక్తం చేసారు. ఇప్పుడు చివరగా టీఆర్ఎస్ అభ్యర్ధి ఓట్లతో విజయం సాధించారు. ఇదే సమయంలో మునుగోడులో బలం లేని బీజేపీ దాదాపు 85 వేల ఓట్లకు పైగా సాధించటంతో గులాబీ నేతలు ఆలోచించాల్సిన అసవరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ తమకు బలం తగ్గలేదని చెబుతున్న సమయంలోనే.. ఈ స్థాయిలో బీజేపీకి ఓట్లు పోలవ్వటం వెనుక విశ్లేషణ అవసరమనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications