Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TS Elections : సాగర్ పై మాట్లాడొద్దు-నేతలకు సీఈవో ఆదేశం-పోలీసులే చూసుకుంటారని...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూత్ లకు ఓటర్లు క్యూ కట్టారు. అదే సమయంలో పోలింగ్ కు ముందు రోజు రాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి డ్యామ్ పైకి వెళ్లి సగం గేట్లను ఆక్రమించారు. ఏపీ పరిధిలోకి వచ్చే గేట్ల వద్ద బ్యారికేడ్లను పెట్టారు. దీనికి అభ్యంతరం తెలిపిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురైంది.

నాగార్జున సాగర్ డ్యామ్ పై తమ పరిధిలో ఉన్న గేట్ల వరకూ బ్యారికేడ్లు పెట్టిన ఏపీ అధికారులు.. ఆ తర్వాత 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేసినట్లు ట్వీట్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు దీనిపై స్పందించడం మొదలుపెట్టారు. ఎన్నికల పోలింగ్ సమయంలో సాగర్ వ్యవహారాన్ని కెలకడం దేనికి సంకేతమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రశ్నించారు.

TS Elections : CEO Vikas raj orders political leaders to keep quiet on sagar water release

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దీనిపై స్పందించారు. పోలీసులతో నిరంతరం టచ్ లో ఉంటూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. రాజకీయ పార్టీలకు సాగర్ వ్యవహారంపై స్పందించకుండా సంయమనం పాటించాలని కోరారు. సాగర్ వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆయన రాజకీయ పార్టీలకు తెలిపారు. అదే సమయంలో సాగర్ వద్ద పరిస్దితిపై ఆయన డీజీపీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసే వరకూ నేతలు మాత్రం నోరు విప్పొద్దని ఆయన సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+