ఏడుపాయల వద్ద విషాదం.. నీటమునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
ఏడుపాయల వద్ద విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలోని ఘన్పూర్ ప్రాజెక్టులో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.
మెదక్: ఏడుపాయల వద్ద విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలోని ఘన్పూర్ ప్రాజెక్టులో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ శివారు సూరారం కాలనీలోని ప్రణతి డిగ్రీ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఏడుపాయల వనదుర్గామాతా దర్శనం కోసం ద్విచక్రవాహనాలపై వెళ్లారు.

ఈ సందర్భంగా వారు ఘన్పూర్ ప్రాజెక్టులో స్నానం చేసేందుకు దిగారు. ప్రమాదవశాత్తూ నీటమునిగి సూరారంకాలనీకి చెందిన ఆనంద్(18), గండిమైసమ్మ చౌరస్తాకు చెందిన సిద్దార్థ(18) ప్రాణాలు కోల్పోయారు.
తోటి విద్యార్థులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పాపన్నపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్రెడ్డి తెలిపారు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications