ఒకే స్పాట్లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు, సిసి కెమెరాల్లో రికార్డ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఒకే స్పాట్లో రెండు షాకింగ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. క్షణాల తేడాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరు త్వరగా వెళ్లాలనే తాపత్రయంతో ప్రమాదానికి గురైతే, మరో ప్రమాదానికి రోడ్డు మీద ఉన్న రాయి కారణం. ఈ రెండు ఘటనలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు దక్కించుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో కోర్టు వైపు నుంచి ఓ థియేటర్ వైపు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన బైకిస్ట్ ఓవర్ టేక్ చేయాలని వేగం పెంచి దాటే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కుదుపు రావడంతో బైక్ వెనుక కూర్చున్న అమ్మాయి అదుపు తప్పి కిందపడింది.

అప్రమత్తమైన టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అయినప్పటికీ టిప్పర్ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆమె గాయాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరీక్ష కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అదే ప్రాంతంలో క్షణాల తేడాలో మరో సంఘటన జరిగింది. ఓ వైపు టిప్పర్ ఘటన జరిగినప్పుడే కుడివైపున మరో ప్రమాదం జరిగింది. థియేటర్ నుంచి కోర్టు వైపు వెళ్తున్న ఓ బైక్.. రోడ్డు పక్కన ఉన్న రాయిపై ఎక్కడంతో కంట్రోల్ తప్పింది.
దీంతో వెనుక కూర్చున్న మహిళ పడిపోయింది. వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ రెండు ప్రమాదాలు సమీపంలోని ఓ దుకాణంలో అమర్చిన సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications