బట్టలు లేకుండా మహిళ మృతదేహం.. మూసీ మర్డర్ మిస్టరీ..!
తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దారుణ హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. కిస్మత్పూర్ ఏరియాలో గుర్తు తెలియని మహిళను హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని మూసి నదిలో పడేసినట్లు గుర్తించారు. నదిలో తేలుతున్న మహిళా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో, పోలీసులు ఇది రేప్ అండ్ మర్డర్ కేసు అయ్యి ఉంటుందని బలంగా అనుమానిస్తున్నారు. మృతురాలిని ఇతర ప్రాంతంలో హత్య చేసి, ఆధారాలు దాచిపెట్టే ప్రయత్నంలో ఇక్కడ పడేశారని భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటం వలన హత్య జరిగి కనీసం 2-3 రోజులు అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్యగా ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇక సంఘటనా ప్రదేశానికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న మిస్సింగ్ కేసుల రికార్డులను కూడా చెక్ చేస్తున్నారు. మృతురాలి గుర్తింపు, అలాగే నిందితుల వివరాలు త్వరలోనే వెలుగులోకి తేవాలని తెలిపారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఫింగర్ప్రింట్ నిపుణులు పలు ఆధారాలను సేకరించారు. మృతదేహం పడేసిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుట్ప్రింట్స్, టైర్ మార్క్స్ వంటి ట్రేస్ ఆధారాలను సేకరిస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూసి నది పరిసరాలు చీకటి పడిన తర్వాత ప్రమాదకర ప్రాంతాలుగా మారుతున్నాయని, భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అంతర్రాష్ట్ర మిస్సింగ్ కేసులు కూడా పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సమీప ప్రాంతాల్లో కనిపించిన సస్పీషస్ వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు అన్నింటినీ చెక్ చేస్తున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకొస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications