Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీవల్లే: కిరణ్ బుక్‌పై వీహెచ్, నిజాంకి కేసీఆర్ పిలుపు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ కిరణ్ రెడ్డి పుస్తకం రాస్తున్నారని వార్తలు రావడంతో ఆయన స్పందించారు.

2010లో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పోషించిన పాత్రను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డికి వీహెచ్ ఓ లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రతిఫలంగా పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం పార్టీని ఆయన వాడుకున్నారన్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రండి

V Hanumantha Rao lashes out at Kiran Kumar Reddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ 8వ నిజాంను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాగా జూన్ 1నుంచి 7వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

అసఫ్ జాహీ పాలకుల వారసుడైన ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ ముకరంజా బహద్దూర్‌ను అవతరణ వేడుకలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆహ్వాన లేఖ పంపించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్‌లో గత వైభవం కోసం అనేక ప్రణాళికలు రూపొందించారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించారని మీర్ బర్కత్ అలీఖాన్‌కు లేఖ రాశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+