మగబిడ్డ పిచ్చి.. మరో పెళ్లి కోరిక.. గర్భిణీ సహా ముగ్గురు బలి!
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గర్భిణీ, ఆమె ఇద్దరు కుమార్తెల ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం మగపిల్లాడు కలగలేదన్న కారణంతో మరో వివాహం చేసుకోవాలనే దురాలోచనతో కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు అజారుద్దీన్తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు.. అబార్షన్ కుట్ర
వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మహ్మద్ అజారుద్దీన్ భార్య ఫర్హత్ మూడోసారి గర్భం దాల్చింది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండటంతో మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందనే అనుమానంతో అజారుద్దీన్ అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఇందుకు కొందరు డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాప్ యజమాని అతడికి సహకరించారు. స్కానింగ్లో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మెడికల్ సిబ్బందిపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు.

మరో పెళ్లి కోసం కిరాతక ప్లాన్
ఈ కేసు విచారణలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అజారుద్దీన్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. అయితే అతనికి ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. భార్య మళ్లీ గర్భిణీ అని తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులు తిరస్కరించారు. వారితో పెళ్లికి అడ్డంకిగా ఉన్నారని భావించిన అజారుద్దీన్.. తన భార్యను, ఇద్దరు కూతుళ్లను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తన ఫామ్హౌస్లో ముందస్తుగా సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేసి, పవర్ సప్లై నిలిపివేసి పక్కా స్కెచ్ వేశాడు.
స్విమ్మింగ్ ఫూల్లో నెట్టి దారుణ హత్య
ఏప్రిల్ 1వ తేదీన తన కుమార్తె పుట్టినరోజు వేడుకల అనంతరం.. భార్యను, ఇద్దరు కూతుళ్లను ఫామ్హౌస్లోని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్లాడు. వారందరినీ నీటిలోకి నెట్టి వారు చనిపోయే వరకు నీళ్లలో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే బాధితురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజారుద్దీన్ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
వైద్యులు సహా పది మంది అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్తో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులు, ఒక డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ షాప్ యజమాని సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు మహిళా డాక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ కిరాతక ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం రేపింది.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications