తగ్గేది లేదు.. జేఏసీలో లుకలుకల్లేవ్.. త్వరలో మరో కార్యాచరణ: కోదండరాం
ఈ నెల 22న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అరెస్టులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ర్యాలీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే.. సూపర్ హిట్ అయిందని జ
హైదరాబాద్: ఈ నెల 22న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అరెస్టులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ర్యాలీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే.. సూపర్ హిట్ అయిందని జేఏసీ వర్గాలు వెల్లడించాయి.
ఇదే క్రమంలో జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు జేఏసీలో లుకలుకలను ఎత్తిచూపాయన్న చర్చ జరిగింది. కోదండరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని పిట్టల రవీందర్ విమర్శించారు.

ఈ నేపథ్యంలో జేఏసీ లుకలుకలపై తాజాగా జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పందించారు.హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఏసీ కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీలో లుకలుకలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
తెలంగాణ నిరుద్యోగుల సమస్యలపై తదుపరి కార్యాచరణను చేపట్టేందుకు ఎల్లుండి విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నిర్బంధాలతో ప్రభుత్వం తమ పోరాటాన్ని అణిచేయాలని ప్రయత్నించినా.. వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
మైనార్టీల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వచ్చేనెల 1న మహబూబ్నగర్, 4న నిర్మల్, 5న కరీంనగర్, 11న వరంగల్ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించబోతున్నామని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications