గుట్ట వ్యభిచార గృహాలపై ఏం చర్యలు తీసుకున్నారు?: పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి సమీపంలోనే వ్యభిచార గృహాల నిర్వహణ జరుగుతున్న విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా తీసుకున్న హైకోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది.
మహిళల, యువతులను, బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలపాలని పోలీసు శాఖను ఆదేశించింది.

యాదాద్రి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మంగళవారం(అక్టోబర్ 23న) స్వయంగా కోర్టుకు హాజరై ఈ కేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోక్సో చట్టంతో బాధితులను రక్షించడానికి స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పేర్కొంది.
తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ వ్యభిచార దందాలోకి చిన్న పిల్లలను కూడా దింపుతున్నారనే ఇటీవల మీడియాల్లో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. చిన్న పిలలలను ఎత్తుకొచ్చి వారిని బలవంతంగా వ్యభిచారిణులుగా మారుస్తున్నారు ఇక్కడి వ్యభిచార గృహాల నిర్వాహకులు.
బాలికల శారీరక ఎదుగుదల కోసం ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉపయోగించడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ముష్కాన్ను ముమ్మరం చేసిన ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పించారు. కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications