మోదీ దయతో ప్రాణాలు రక్షించారా : యుద్దంలో చిక్కుకున్నవారితో.. : కేటీఆర్ సీరియస్..!!
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం వేళ అనేక మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిలో విద్యార్ధులే ఎక్కువగా ఉన్నారు. వారిని ఆపరేషన్ గంగా పేరుతో కేంద్రం ప్రత్యేకంగా వాయు సేన విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇందు కోసం నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలను పంపారు. వారు అక్కడ నుంచి వాయుసేన విమానాల్లో స్వదేశానికి భారతీయుల ను పంపుతున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు.. జై మోడీ నినాదాల పైన తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Jeevan Bach Gaya Hai Modi Ji ki Krupa Se!!!
— KTR (@KTRTRS) March 4, 2022
Seriously, what a terrible way of doing PR with distressed & tired students. Heights of nonsense
By the way who is this “Jeevan” jo Bach Gaya?😄 https://t.co/Tjrago6qxh
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'పీఆర్ ఎక్సర్సైజ్'గా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లేప్రాణాలు దక్కాయంటూ..ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్ లో ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన విమానంలో కేంద్ర మంత్రి అజయ్ భట్ విద్యార్ధులతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని మోదీ దయ వలనే ప్రాణాలతో బయట పడ్డారంటూ వ్యాఖ్యానించారు.
భారత్ మతాకు జై అంటూ...కొనసాగింపుగా విద్యార్ధులతో మోదీ జీ జిందాబాద్ అనే నినాదాలు చేయించారు. దీనిని పోస్టు చేసిన కేటీఆర్ ఆందోళనతో..ఆవేదనతో ఉన్న విద్యార్ధుల తో ఏంటీ ఈ విధానం అంటూ ప్రశ్నించారు. కాగా, ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 16 వేల మందిని స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగా శాఖ ప్రకటించింది. రాబోయే 2, 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్దుల కోసం ఢిల్లీలోని ఏపీ -తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేసారు. ఢిల్లీ నుంచి వారిని స్వరాష్ట్రాలకు పంపుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు.