పోలీసులు షాక్: యాచకురాలి వద్ద రూ.2లక్షల నగదు, ఏం చేశారంటే?
హైదరాబాద్: నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చే ప్రయత్నంలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని యాచకులను వారి సమ్మతి మేరకు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్). ఇందులో భాగంగా ముసారాంభాగ్ టీవీ వద్ద ఉన్న ఓ యాచకురాలిని జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు కలిసి చర్లపల్లి జైలు వద్ద ఉన్న పునరావాస కేంద్రానికి తరలించారు.
అయితే, ఆమె వద్ద ఉన్న సంచిలో రూ.2,34,320 నగదు ఉండటం చూసి వారంతా షాకయ్యారు. కాగా, భర్త చనిపోవడంతో పెంటమ్మ అనే ఈ మహిళ తన ఇద్దరు కొడుకులతో నల్గొండలోని మిర్యాలగూడలో ఉండేది. తనకు చెందిన 60యార్డ్ భూమిని అమ్మిన ఆమె.. వచ్చిన రూ.2లక్షల్లో ఒక లక్ష రూపాయలను ఆమె కుటుంబానికి ఇచ్చేసింది.

ఆ తర్వాత ఓ కొడుకు చనిపోవడం, మరో కొడుకు అదృశ్యమవడంతో పెంటమ్మ ఇంటి నుంచి బయటికి వచ్చింది. 2011లో హైదరాబాద్ వచ్చిన ఆమె.. ముసారాంభాగ్ టీవీ టవర్ వద్ద భిక్షమెత్తుకుంటూ జీవిస్తోంది. కాగా, పెంటమ్మ వద్ద ఉన్న డబ్బును గుర్తించిన పోలీసులు.. ఆమె పేరిట ఎస్బీఐ బ్యాంకు ఖాతా తెరిపించి అందులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయించారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications