వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళని రేప్ చేసి కాల్చేశారు, రూపు మారిన యువతి మృతి

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాల దారుణం జరిగింది. ఓ మహిళ పైన లైంగిక దాడి చేసి, ఆ తర్వాత పెట్రోలు పోల్చి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇది చారగొండ గ్రామ శివారులో జరిగింది.

దుండగులు మహిళ పైన అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు కాల్చి వేయడంతో ఆమె శవం సగం కాలింది.

రూపు మారిన మృతి

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి, కొద్ది రోజుల క్రితం గుర్తు పట్టలేని విధంగా తయారయిన యువతి మృతి చెందింది. పిట్స్ సమస్యతో కొద్దిరోజుల క్రితం నార్కెట్‌పల్లిలోని ఓ ఆసుపత్రిలో చేరిన మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

Woman raped and killed in Mahaboobnagar District

నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన మీనాక్షి పిట్స్ సమస్యతో బాధపడుతోంది. ఆమె జ్వరంతో పిడ్స్ వచ్చి బాధపడుతుండటంతో తండ్రి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. తన కూతురి ఆరోగ్యం మెరుగవుతుందని ఆశించిన ఆ తండ్రి చికిత్స అనంతరం తన కూతురికి చూసి కుమిలిపోయాడు.

వైద్యులు గ్లూక్లోజ్‌లో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ఆమె శరీరమంతా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సదరు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దీంతో ఆమెను జూన్ 22న గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

English summary
Woman raped and killed in Mahaboobnagar District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X