గంజాయి డబ్బు కోసం అమ్మాయి తాకట్టు, వేధింపులు
హైదరాబాద్: గంజాయి వ్యాపారాన్ని నిర్వహించడం చట్ట విరుద్ధం. అలాంటిది గంజాయి తీసుకొస్తామని చెప్పి, కూతురు వరసయ్యే అమ్మాయిని తాకట్టు పెట్టిన సంఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బోడుమీది తండాలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోడుమీదితండాకు చెందిన దల్సింగ్, బావ్సింగ్ గంజాయి వ్యాపారం చేస్తుంటారు. వీరికి విశాఖ జిల్లా గూడెంకు చెందిన పాండయ్యతో గత కొంత కాలంగా స్నేహం ఏర్పడింది. ఆండయ్య విశాఖలో గంజాయి వ్యాపారం చేస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో సుమారు 20 రోజుల క్రితం తనకు కూతురు వరుసయ్యే కాసులమ్మ అనే మహిళను తీసుకొని ఆండయ్య బోడుమీది తండాకు వచ్చాడు. తన వద్ద గూడెంలో గంజాయి ఉందని, రూ. 35 వేలు ఇస్తే ఆ గంజాయిని ఇస్తానన్నాడు. రూ.38 వేలు ఇవ్వడానికి అంగీకరించిన దల్సింగ్, బావ్సింగ్ డబ్బు తీసుకొని మీరు పారిపోతే తమకు నమ్మకం ఏమిటంటూ ప్రశ్నించాడు.

దీంతో వరుసకు కూతురయ్యే కాసులమ్మను రూ. 38 వేలకు తాకట్టుగా ఉంచుతానని, గంజాయి ఇచ్చాక తన కూతురును తీసుకొని వెళ్తానని చెప్పాడు. దీంతో కాసులమ్మను తమ వద్ద ఉంచుకొని రూ. 35 వేలను పాండయ్యకు దల్సింగ్, బాల్సింగ్ ఇచ్చారు.
డబ్బులు తీసుకొని వెళ్లిన పాండయ్య ఎంతకీ రాకపోవడంతో కాసులమ్మను నిర్బంధించారు. శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. దల్సింగ్, బావ్సింగ్ల వేధింపులను తట్టుకోలేని కాసులమ్మ ఎలాగోలా కాసులమ్మ తాను వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బోటిమీది తండాలో ఉన్నట్లు తన బంధువులకు సమాచారం ఇచ్చింది.
దీంతో కాసులమ్మ బంధువులు తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన మహబూబాబాద్ వాసి సోమారపు వీరస్వామి సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ టౌన్ సిఐ నంది రాం నాయక్ బోటిమీది తండాకు వెళ్లి ఆరా తీశారు. కాసులమ్మ బావ్సింగ్, దల్సింగ్ల ఇంటి వద్ద ఉండడంతో ఆమెను విడిపించి కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications