జగన్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా: ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు లేఖ
కడప: కడప జిల్లా మైదుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడదు రఘురామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ఆయన స్పీకర్ కోడెల శివ ప్రసాద్కి పంపించారు. తక్షణం ఆమోదించాలని కోరారు.
రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా శుక్రవారంనాడు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనను కాదని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ను ముందు వేదికపైకి పిలవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.

ఇది మొదటి సారి కాదని జిల్లా అధికారులు గతంలో అనేక సార్లు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారని లేఖలో తెలిపారు. ఇదే అంశాన్ని ఆయన ఇంతకుముందు పలుమార్లు స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కొరియర్ ద్వారా కూడా తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్కు పంపించారు.
తనకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ పుట్టా సుధాకర్ను వేదిక మీదికి ఆహ్వానంచడాన్ని అవమానంగా భావించి ఆయన అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications