ఏపీకి ' ప్రత్యేక హోదా' కోసం కరీంనగర్లో వైసీపీ ధర్నా..
రహదారులపై ధర్నాలకు దిగిన నేతలు హోదాకు మద్దతు తెలుపుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్ ఉద్యమిస్తుండటంతో.. అదే స్ఫూర్తితో ఇటు తెలంగాణ రాష్ట్రంలోను ఆ పార్టీ కార్యకర్తలు హోదాపై నినదిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు నిరసనకు దిగారు.
రహదారులపై ధర్నాలకు దిగిన నేతలు హోదాకు మద్దతు తెలుపుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ చౌక్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హోదా ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. హోదాపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజా ఆందోళనలను అణిచివేయాలన్న ఆలోచనలను మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
English summary
Ysrcp cadre was held dharna in Karimnagar for AP Special status. They opposed TDP govt negligence on Special status
Story first published: Friday, January 27, 2017, 15:17 [IST]