అభినయ వర్సెస్ సునీల్: తిరుపతి ఎయిర్ పోర్టు, క్వార్టర్స్కు నిలిచిన నీరు..
తిరుపతి ఎయిర్ పోర్టు, సిబ్బంది నివాస గృహాలకు ఇటీవల నీటి సరఫరా నిలిచిపోయింది. ఎందుకు అని తెలిస్తే.. షాక్ అవుతారు. అవును అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు.. తిరుపతి డిప్యూటీ మేయర్ నీటిని నిలిపివేసి తన కక్షను తీర్చుకున్నాడు. ఈ మేరకు ఇండియా టుడే వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అసలు ఏం జరిగిందంటే..?

బొత్స రాగా..
ఇటీవల తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ముగింపు వేడుకలు ముఖ్య అతిథిగా మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆయనతోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి వెళ్లారు. అక్కడ అతనని ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేశారు. ఇంకేముంది అభినయకు ఎక్కడో కాలింది.. తననే అడ్డుకుంటారా అంటూ ఎయిర్ పోర్టు, సిబ్బంది నివాస గృహాలకు తన సత్తా ఏంటో చూపించారు.

అభినయను ఆపిన సునీల్
అభినయ రెడ్డిని తిరుపతి ఎయిర్ పోర్టు మేనేజర్ సునీల్ అడ్డుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆయన నీటి సరఫరాను నిలిపివేయించారు. వాస్తవానికి నీటి సరఫరా ఊరికే ఆగిపోదు. చెబితేనే.. కావాలని నిలిపివేస్తే మాత్రం రావు. ఇందులో అభినయ పాత్ర ఉందని తెలుస్తోంది. కానీ తిరుపతి మున్సిపల్ సిబ్బంది మాత్రం పైపులైన్లో సమస్య ఏర్పడిందని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు.
Recommended Video

నిలిచిన నీటి సరఫరా
ఎయిర్ పోర్టు కాదు.. నివాస గృహాలకు కూడా నీటి సరఫరా లేదు. అంతేకాదు డ్రైనేజీ సమస్య కూడా ఏర్పడగా.. తెలుగు గంగ నీటిని డ్రైనేజీ కలుషితం చేస్తుందని చెప్పారు. అయితే అంతకుముందు ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ నేతల ప్రవర్తన సరిగా లేదని సమాచారం.
దీనిపై తిరుపతి మున్సిపల్, రేణిగుంట విమానాశ్రయ సిబ్బందిని వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం మండిపడింది. ఎయిర్ పోర్టు, క్వార్టర్లకు నీరు నిలిపివేయడం ఏంటీ అని నారా లోకేశ్ అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదీ వైసీపీ ప్రభుత్వ అనాగరిక చర్యగా అభివర్ణించారు. దీనిని తమ పార్టీ ఖండిస్తుందని తెలియజేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications