మాఫియాకు తుదిశ్వాసే, పరివార్వాడీకి మళ్లీ పరాజయమే: అఖిలేష్ ఎస్పీకి ప్రధాని మోడీ సెటైర్లు
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్(దేహత్)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్బర్పూర్ లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ దగ్గర నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
యూపీలో బీజేపీ గెలుపు ఖాయమన్న ప్రధాని మోడీ
యూపీ ఎన్నికల తొలి దశ పోకడలు, రెండో విడతలో పార్టీని ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి ఢంకా బజాయించి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడో దశలో పోలింగ్ జరగనున్న కాన్పూర్లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ తమ వర్చువల్ ప్రసారానికి ఏర్పాట్లు చేసింది. కాన్పూర్, కాన్పూర్ రూరల్, రసూలాబాద్, రానియా అక్బర్పూర్, సికంద్రా, భోగ్నిపూర్, మధోఘర్, ఒరాయ్, కల్పిలోని బితూర్, బిల్హౌర్, ఘతంపూర్ అసెంబ్లీల నుంచి పార్టీ మద్దతుదారులు కూడా ప్రధాని ప్రసంగం వినడానికి ర్యాలీ గ్రౌండ్కు చేరుకున్నారు. ప్రత్యక్ష ర్యాలీలో ఆయా అసెంబ్లీల అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. అదే సమయంలో, వర్చువల్ ర్యాలీలో అసెంబ్లీలో ఏదైనా ఒక కార్యక్రమంలో అభ్యర్థులు హాజరయ్యారు. కాన్పూర్ జిల్లాలోని కళ్యాణ్పూర్, గోవింద్నగర్, సిసామౌ, ఆర్యనగర్, కిద్వాయ్నగర్, ఛవానీ, మహారాజ్పూర్ అసెంబ్లీ స్థానాల ప్రజలను ఉద్దేశించి వర్చువల్ మీడియం ద్వారా ప్రధాని ప్రసంగించారు. దీని కోసం, కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ, 27 సంస్థాగత ప్రాంతాలలో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా ప్రజలకు ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.
పరివార్వాడీని మళ్లీ ఓడిస్తారు.. యూపీలో మాఫియాగిరీకి చివరి శ్వాసే: మోడీ
'ఉత్తరప్రదేశ్ ప్రజలు 'పరివార్వాడి'ని మళ్లీ ఓడిస్తారని, మార్చి 10న ఉత్తరప్రదేశ్లో రంగుల పండుగ హోలీని జరుపుకుంటారని ప్రతిపక్ష పార్టీలను హేళన చేస్తూ పీఎం మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కోసం ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిపై పరోక్షంగా విరుచుకుపడిన ప్రధాని మోడీ, "వారు తమ మిత్రపక్షాలను మార్చుకుంటూ ఉన్నప్పుడు, వారు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఎలా సేవ చేస్తారు?... అంతకుముందు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను లూటీ చేశాయి " అని ఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలను దూషిస్తూ ప్రధాని ఇలా అన్నారు.. "వారి మార్గం వారికి ఉంటే, వారు యూపీలోని కాన్పూర్, ఇతర ప్రాంతాలను 'మాఫియాగంజ్' మొహల్లాగా చేసేవారు, ఇప్పుడు వారి 'మాఫియాగిరి' తన చివరి శ్వాసను లెక్కిస్తోంది. ఈ 'పరివార్వాడి' ఈ మాఫియాలకు మళ్లీ అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాయి. అందుకే యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
బీజేపీలో పాలనలోనే ముస్లిం బాలికలు, మహిళలకు భద్రత: మోడీ
ముస్లిం జనాభాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలనలో ముస్లిం బాలికలు సురక్షితంగా ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చాలా మంది ముస్లిం బాలికలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. ముస్లిం మహిళా ఓటర్లు నన్ను ఆశీర్వదించాలని కోరుతూ శాంతియుతంగా మోడీకి ఓటు వేయడానికి తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు అని ప్రధాని మోడీ అన్నారు. 2017కి ముందు యూపీలో ప్రతి రోజూ రేషన్ కుంభకోణాలు జరిగాయని ప్రధాని మోడీ అన్నారు. లక్షల్లో నకిలీ రేషన్ కార్డులు తయారు చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ నకిలీ రేషన్ కార్డు పథకానికి స్వస్తి పలికింది. నేడు, కోట్లాది మంది యూపీ ప్రజలకు ఉచితంగా రేషన్ అందుతోంది. నా పేద సోదరీమణులు, తల్లుల పొయ్యిలు ఎప్పటికీ ఆపివేయబడవు అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications