Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్యాపిటల్ వార్ .. జగన్ ను హెచ్చరించిన దేవినేని ఉమ.. నిరసన దీక్ష విరమణ..

ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. హై పవర్ కమిటీ వేసి రాజధానిపై తుది ప్రకటన వాయిదా వేసినప్పటికీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ ముందుకు వచ్చింది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 24 గంటల దీక్షను చేపట్టారు. 24 గంటలపాటు దీక్ష చేసిన ఆయన ప్రస్తుతం దీక్ష విరమించారు.

సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్న దేవినేని ఉమ

సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్న దేవినేని ఉమ

రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని గొల్లపూడిలోచేసిన దీక్షను ఈ రోజు మధ్యాహ్నం పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఇక ఈ నేపధ్యంలో ఆయన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్

రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తమ భూములను త్యాగం చేసిన రైతులనుద్దేశించి మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని దేవినేని విమర్శలు గుప్పించారు. జగన్‌ అధికారం చేపట్టాక ప్రజలు పండగల్ని మర్చిపోయారని మండిపడ్డారు దేవినేని ఉమ. ఇసుక కొరత ద్వారా లక్షల మంది కడుపుకొట్టారని నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని దుయ్యబట్టారు.

 రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని హెచ్చరిక

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని హెచ్చరిక

ఉద్యమాల ద్వారానే జగన్‌ పిచ్చి తగ్గుతుందన్నారు.జీఎన్‌రావు ఆర్డీవోగా ఉన్నప్పుడే రెండుసార్లు సస్పెండ్‌ అయ్యారని అలాంట్ వ్యక్తిని కమిటీ చైర్మన్ గా నియమించి ఆయన రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తే ప్రజలు ఏమైపోతారని నిలదీశారు. ప్రజాభిప్రాయం స్వీకరించకుండా కమిటీలు రిపోర్ట్‌లు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని అందుకే విశాఖ రాజధాని అని చెప్తున్నారన్నారు. రాజధాని రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని దేవినేని హెచ్చరించారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+