క్యాపిటల్ వార్ .. జగన్ ను హెచ్చరించిన దేవినేని ఉమ.. నిరసన దీక్ష విరమణ..
ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. హై పవర్ కమిటీ వేసి రాజధానిపై తుది ప్రకటన వాయిదా వేసినప్పటికీ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ ముందుకు వచ్చింది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 24 గంటల దీక్షను చేపట్టారు. 24 గంటలపాటు దీక్ష చేసిన ఆయన ప్రస్తుతం దీక్ష విరమించారు.

సీఎం జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడన్న దేవినేని ఉమ
రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని గొల్లపూడిలోచేసిన దీక్షను ఈ రోజు మధ్యాహ్నం పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఇక ఈ నేపధ్యంలో ఆయన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్
రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తమ భూములను త్యాగం చేసిన రైతులనుద్దేశించి మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని దేవినేని విమర్శలు గుప్పించారు. జగన్ అధికారం చేపట్టాక ప్రజలు పండగల్ని మర్చిపోయారని మండిపడ్డారు దేవినేని ఉమ. ఇసుక కొరత ద్వారా లక్షల మంది కడుపుకొట్టారని నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని దుయ్యబట్టారు.

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని హెచ్చరిక
ఉద్యమాల ద్వారానే జగన్ పిచ్చి తగ్గుతుందన్నారు.జీఎన్రావు ఆర్డీవోగా ఉన్నప్పుడే రెండుసార్లు సస్పెండ్ అయ్యారని అలాంట్ వ్యక్తిని కమిటీ చైర్మన్ గా నియమించి ఆయన రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తే ప్రజలు ఏమైపోతారని నిలదీశారు. ప్రజాభిప్రాయం స్వీకరించకుండా కమిటీలు రిపోర్ట్లు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని అందుకే విశాఖ రాజధాని అని చెప్తున్నారన్నారు. రాజధాని రైతుల ఉసురు పోసుకుంటే అడ్రెస్ లేకుండా పోతారని దేవినేని హెచ్చరించారు .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications