అసెంబ్లీ ఐదురోజులు చాలకపోతే జూమ్, ట్విట్టర్లో పెట్టుకోండి- చంద్రబాబు, లోకేష్పై కొడాలి నాని
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తర్వాత పలువురు ప్రముఖులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం బీఏసీలో ఐదురోజుల పాటు సభలు నిర్వహించాలని అధికారపక్షం నిర్ణయించింది. దీనిపై విపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్చాట్ మాట్లాడిన మంత్రి కొడాలినాని టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహించాలన్న వైసీపీ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కొడాలి స్పందించారు. ఐదురోజుల అసెంబ్లీ చంద్రబాబు, లోకేష్కు సరిపోకపోతే ట్విట్టర్, జూమ్లో సమావేశాలు పెట్టుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సహచర మంత్రి పేర్నినానిపై జరిగిన దాడిని కొడాలి నాని ఖండించారు.

గతంలో సీఎం జగన్, ఇప్పుడు పేర్నినాని కావాలని దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. అలిపిరిలో కూడా చంద్రబాబు కావాలనే దాడి చేయించుకున్నారా అని ప్రశ్నించారు. మాకు మా కన్నా ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. మంత్రి పేర్నినాని ఎప్పుడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగానే తిరుగుతున్నారని కొడాలి నాని గుర్తుచేసారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని నాని తెలిపారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications