విశాఖలో మరో కలకలం: రుషికొండ బీచ్ సమీపానికి: 2 కిలోమీటర్ల పొడవునా: ఆక్సిజన్ అందకే
విశాఖపట్నం: పారిశ్రామికంగా వరుస ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరికి గురవుతోన్న విశాఖపట్నంలో తాజాగా మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన రుషికొండ తీర ప్రాంతానికి వేలాదిగా మృత చేపలు కొట్టుకుని వచ్చాయి. రుషికొండ, సాగర్ నగర్ బీచ్ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా మృత చేపలు కుప్పగా పోగయ్యాయి.
ఉదయం నుంచీ సాయంత్రం దాకా నిర్జీవ చేపలు కొట్టుకుని రావడం కనిపించింది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పల వల్లే అవి మరణించినట్లు అనుమానిస్తున్నారు. దీనికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తీర ప్రాంతానికి కొట్టుకుని వచ్చిన వాటిిల్లో చాలా మటుకు సిల్వర్ బెల్లీ ఫిష్లు ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కే ఫణి ప్రకాష్ తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే అవి మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు.

అయిదారు రోజులుగా విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఫలితంగా వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల చేపలు మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. బంగాళాఖాతం ఉపరితలంపై క్రమం తప్పకుండా ఏర్పడుతోన్న ఆవర్తనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ఆక్సిజన్ శాతం క్షీణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యం వల్ల చేపలు మరణించాయనడానికి ఆధారాలు లేవని ఫణి ప్రకాష్ తెలిపారు. 2010లో అప్పికొండ తీర ప్రాంతానికి ఇలాగే వందలాది మృత చేపలు కొట్టుకొచ్చాయని గుర్తు చేశారు.
అయినప్పటికీ.. వేల సంఖ్యలో చేపల మరణించడానికి గల కారణాలను అన్వేషిస్తామని అన్నారు. దీనితో ఓ నివేదిక అందజేయాలని భీమిలీ మత్స్య సంపద అభివృద్ధి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. సిల్వర్ జెల్లీ ఫిష్లను సాాధారణంగా కమర్షియల్ కార్యకలాపాల కోసం వినియోగించరని అన్నారు. డ్రై షిష్గా, కోళ్లకు ఆహారంగా వినియోగిస్తుంటారని అన్నారు. చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయనే సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికులు వాటిని సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications